కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం

కృష్ణాష్టమి వేడుకల్లో విషాదం

బెంగాల్ కృష్ణాష్టమి వేడుకల్లో అపశృతి చోటు చేసుకుంది. నార్త్ 24 పరగణాస్ జిల్లాలోని కచువా లోక్ నాథ్ బాబా టెంపుల్ లో గోడ కూలి నలుగురు భక్తులు చనిపోగా.. 27 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స చేస్తున్నారు. ప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు 5 లక్షల పరిహారం ప్రకటించారు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ. తీవ్రంగా గాయపడ్డ వారికి లక్ష రూపాయలు, మామూలు గాయాలైన వారికి 50 వేల చొప్పున సహాయం ప్రకటించారు.

4-killed-several-injured-in-stampede-during-janmashatami-celebrations-in-loknath-temple-at-west-bengal