ఢిల్లీలో దారుణం..నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఢిల్లీలో దారుణం..నాలుగేళ్ల చిన్నారిపై అత్యాచారం

ఢిల్లీలో దారుణం జరిగింది.  బాపా నగర్ ప్రాంతంలో నాలుగేళ్ల చిన్నారిపై 25 ఏళ్ల వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం తెలిసిన పలువురు వ్యక్తులు నిందితుడిని చితకబాదారు. నిందితుడి భూపేశ్ గా గుర్తించిన పోలీసులు  అతడిని అరెస్టు చేసి అత్యాచారం కేసు నమోదు చేసినట్లు  తెలిపారు. గత వారం జీన్స్ తయారీ ఫ్యాక్టరీ సమీపంలో ఉన్న ఓ చిన్నారి తన ఇంటి దగ్గర ఆడుకుంటుండగా..  ఫ్యాక్టరీలో పనిచేసే కార్మికుడు, చిన్నారిని మిఠాయిలతో లోపలికి రప్పించి, లైంగికంగా వేధించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత జరిగిన సంఘటన గురించి చిన్నారి తన తల్లిదండ్రులకు చెప్పడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యులు , కొంతమంది స్థానికులు జీన్స్ ఫ్యాక్టరీకి చేరుకుని నిందితుడిని కొట్టారని చెప్పారు. నిందితుడిని  అరెస్టు చేసి.. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.