
హైదరాబాద్, వెలుగు: సికింద్రాబాద్ ఏరియా లో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నాయి. ప్యారడైజ్, రాణీగంజ్, మోండా మార్కెట్ ఏరియాల్లో బుధవారం 40 కేసులు నమోదయ్యాయి. జీహెచ్ఎంసీ, పోలీస్ అధికారులు కంటెయిన్మెంట్ చర్యలు చేపట్టారు. నిత్యం రద్దీగా ఉండే సూర్య టవర్స్, పారడైజ్, సిటీ లైట్స్ హోటల్, మినర్వా కాంప్లెక్స్ను మూసేశారు. సిటీ లైట్స్ సమీపంలోనే 14 కేసులు రిజిస్టర్ అయ్యాయి. మహవీర్ టెక్స్టైల్, పాన్ బజార్ ఏరియాల్లో రాకపోకలు నిలిపేశారు.
గాజులరామారం డీసీకి..
జీహెచ్ఎంసీ సిబ్బందిలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గ్రేటర్ వ్యాప్తంగా ఇప్పటికే 40 మందికి పైగా వైరస్బారిన పడ్డారు. బుధవారం గాజులరామారం సర్కిల్ డిప్యూటీ కమిషనర్కు, జీహెచ్ఎంసీ హెడ్డాఫీస్లో ఐటీ ఉద్యోగికి పాజిటివ్వచ్చింది. అధికారులు ఐటీ విభాగాన్ని క్లోజ్చేసి ఉద్యోగులను ఇంటికి పంపించారు.
హోం మంత్రి ఎస్కార్ట్స్లో ఐదుగురికి..
హోంమంత్రి మహమూద్ అలీ సెక్యూరిటీ సిబ్బందిలో బుధవారం ఐదుగురికి కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయింది. ముందుగా ఓ అధికారికి వైరస్ సోకడంతో మూడ్రోజులుగా50 మంది సిబ్బందికి టెస్టులు చేశారు. మరో 15 మంది రిజల్ట్స్ గురువారం రానున్నాయి.
పరిగిలో ఒకరికి..
వికారాబాద్ జిల్లా పరిగి గంజ్ రోడ్డులోని బట్టల వ్యాపారికి జ్వరం రావడంతో సిటీలో టెస్ట్ చేయించగా పాజిటివ్గా తేలింది.