ఎన్నికల విధులకు గైర్హాజరైన 40 మంది సస్పెండ్

ఎన్నికల విధులకు గైర్హాజరైన 40 మంది సస్పెండ్

హైదరాబాద్, వెలుగు: ఎన్నికల విధులకు గైర్హాజరైన 40 మంది పీఓ, ఏపీఓలను సస్పెండ్ చేసినట్లు హైదరాబాద్​జిల్లా ఎన్నికల అధికారి, బల్దియా కమిషనర్​రోనాల్డ్ రోస్ తెలిపారు. 40 మంది ఆఫీసర్లు శిక్షణ తరగతులకు హాజరుకాలేదని, రిమైండర్లు పంపినా స్పందించలేదన్నారు.

 ఆర్పీ యాక్ట్1951 ఉల్లంఘన కింద వారందరినీ సస్పెండ్ చేశామని చెప్పారు. ఈనెల 9,10వ తేదీల్లో మూడో దశ శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నామని, గైర్హాజరైతే ఇదే తరహా చర్యలు ఉంటాయని హెచ్చరించారు.