దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 41 వేల కరోనా కేసులు

దేశంలో కొత్తగా 41 వేల 506 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది. నిన్నటితో పోల్చితే 2 శాతం కేసులు తగ్గాయి. దీంతో మొత్తం బాధితుల సంఖ్య 3 కోట్ల 8 లక్షల 37 వేల 222కు చేరింది. నిన్న కరోనా కారణంగా 895 మంది ప్రాణాలు కోల్పోగా..మొత్తం మరణాల సంఖ్య 4 లక్షల 8 వేలు దాటింది. ఇప్పటివరకూ దేశవ్యాప్తంగా 2 కోట్ల 99 లక్షల 75 వేల 64 మంది కరోనా నుంచి కోలుకున్నారు.ప్రస్తుతం దేశంలో 4 లక్షల 54 వేల యాక్టివ్ కేసులున్నాయి. దేశంలో రికవరీ రేటు 97.20 శాతానికి పెరిగింది. మరణాలరేటు 1.32 శాతంగా ఉంది. ఇక ఇప్పటివరకూ దేశంలో 37 కోట్ల 60 లక్షల 32 వేల వ్యాక్సిన్ డోసులు పంపిణీ చేశారు.