
ఏపీలో కొత్తగా మరో 12 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా బాధితుల సంఖ్య 432కి చేరాయి. గుంటూరులో కొత్తగా 8 ,చిత్తూరులో 2, కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో కొత్తగా ఒక్కో కేసు నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఏపీలో కరోనాతో ఏడుగురు చనిపోయారు.
గుంటూరు జిల్లాలో అత్యధికంగా 90 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కర్నూలు జిల్లాలో 84, నెల్లూరులో 52, ప్రకాశంలో 41, కృష్ణా జిల్లాలో 36, కడపలో 31, తూర్పుగోదావారి జిల్లాలో 23, చిత్తూరులో 23, విశాఖ జిల్లాలో 20 తూర్పుగోదావరి జిల్లాలో 17, అనంతపురంలో 15 కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతానికి శ్రీకాకుళం, విజయనగరం కరోనా ఫ్రీ జిల్లాలుగా ఉన్నాయి.