దుబాయ్లో ఏఎఫ్ఎం ప్రాపర్టీస్ ప్రెజెంట్స్ ‘గామా తెలుగు మూవీ అవార్డ్స్’ నాలుగో ఎడిషన్ జరగనుంది. మార్చి 3న జబిల్ పార్క్లో ఈ అవార్డ్స్ వేడుకను నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన కర్టెన్ రైజర్ కార్యక్రమం శుక్రవారం హైదరాబాదులో జరిగింది.
జ్యూరీ చైర్మన్గా వ్యవహరిస్తున్న మ్యూజిక్ డైరెక్టర్ కోటి, సభ్యులు వీఎన్ ఆదిత్య, రఘు కుంచె, నిర్మాత డీవీవీ దానయ్య, దర్శకులు సాయి రాజేష్, ప్రసన్న, హీరోయిన్ డింపుల్ హయతి, గామా అవార్డ్స్ సీఈఓ సౌరభ్ అవార్డ్స్ ట్రోఫీని లాంచ్ చేశారు. 2021 నుంచి 2023 వరకు విడుదలైన చిత్రాల నుంచి వివిధ కేటగిరీలలో అవార్డులు అందజేయనున్నట్టు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ సహా పలువురు సినీ సెలబ్రిటీస్ను ఆహ్వానించినట్టు నిర్వాహకులు చెప్పారు.