ఆర్టీసీ బస్సులో దాదాపు 5 కేజీల బంగారం స్వాధీనం

ఆర్టీసీ బస్సులో దాదాపు 5 కేజీల బంగారం స్వాధీనం

కర్నూలులో భారీగా బంగారం పట్టుబడింది. హైదరాబాద్ నుంచి కర్నూలు వెళ్తున్న ఆర్టీసీ బస్సును తనిఖీ చేయగా 4.8 కిలోల 148 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. దీని విలువ దాదాపు 6.68 కోట్లు ఉంటుందన్నారు. కడప జిల్లాకు చెందిన మిద్దె రాజా హైదరాబాద్ లోని  ఓ గోల్డ్ షాప్ నుంచి తీసుకుని తాడిపత్రికి వెళ్తుండగా పంచలింగాల చెక్ పోస్ట్ వద్ద పట్టుకున్నారు. బంగారానికి ఎటువంటి రశీదు లేకపోవడంతో  సీజ్ చేసిన పోలీసులు కేసు నమోదు చేశారు.