ఏటీఎం నుంచి రూ.5 లక్షలు చోరీ

ఏటీఎం నుంచి రూ.5 లక్షలు చోరీ

మూసాపేట, వెలుగు : మనీ డ్రా చేసేందుకు వచ్చిన వ్యక్తి ఏటీఎం మెషీన్​నుంచి రూ.5 లక్షలు చోరీ చేసిన ఘటన కేపీహెచ్ బీ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. కేపీహెచ్​బీ రోడ్​నంబర్.4లోని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర ఏటీఎంలోకి శుక్రవారం అర్ధరాత్రి తర్వాత 2.45 గంటలకు ఓ వ్యక్తి వచ్చాడు. మొదట మనీ విత్​డ్రా చేశాడు. తర్వాత ఫేక్​కార్డ్ తో ఏటీఎంలోని రూ.5 లక్షలు దోచుకెళ్లాడు.

ఇదంతా సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఏటీఎంలలో నగదు జమ చేసే యువకుడే ఈ చోరీకి పాల్పడ్డాడని, అతడిని బాలానగర్ సీసీఎస్​పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది.