బెంగళూరులో భారీ ఉగ్రదాడిని పోలీసులు భగ్నం చేశారు. నగరం అంతటా దాడులకు ప్లాన్ చేసినందుకు ఐదుగురు తీవ్రవాద అనుమానితులను సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ (CCB) అరెస్టు చేసింది. పేలుళ్లకు ప్లాన్ చేసిన వారిలో ఉన్న మరో ఐదుగురి కోసం గాలిస్తున్నారు . అరెస్టయిన వారిని జునైద్, సోహైల్, ఉమర్, ముదాసిర్, జాహిద్లుగా గుర్తించారు.
వారి మొబైల్ ఫోన్లతో పాటు పలు పేలుడు పదార్థాలు, ఇతర వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు.అరెస్టయిన ఐదుగురు నిందితులు కూడా 2017లో జరిగిన హత్యకేసులో ప్రమేయం ఉన్నారని పోలీసులు తెలిపారు.
జైలులో వారికి కొంతమంది ఉగ్రవాదులతో పరిచయం ఏర్పడిందని, వారు పేలుడు పదార్థాలను తయారు చేయడంలో శిక్షణ పొందారు. నగరంలో పేలుళ్లకు సంబంధించిన ప్లాన్పై సీసీబీకి సమాచారం అందడంతో నిందితులను అరెస్ట్ చేశారు.