జమ్మూకశ్మీర్లోని ఉగ్రవాదుల ఏరివేత కొనసాగుతూనే ఉంది. శనివారం రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఎన్ కౌంటర్ జరిగింది. ఎన్కౌంటర్లలో జైషే మహ్మద్ కమాండర్ సహా ఐదుగురు ఉగ్రవాదులు హతమైనట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో జైషే మహ్మద్ కమాండర్ జాహిద్ వానీ కూడా ఉన్నాడని జమ్మూకాశ్మీర్ పోలీసులు ట్వీట్ చేశారు. కశ్మీర్లోని బుడ్గాం జిల్లాలోని చ్రార్-ఎ-షరీఫ్ ప్రాంతంలో జరిగిన ఒక ఎన్ కౌంటర్ లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. అదేవిధంగా పుల్వామా జిల్లాలోని నైరా ప్రాంతంలో ఉగ్రవాదులు, భద్రతాదళాలకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఎన్కౌంటర్ లో నలుగురు ఉగ్రవాదులు చనిపోయారు. ఘటనాస్థలం నుంచి భారీగా పేలుడు పదార్ధాలు, AK-56 తుపాకులను స్వాధీనం చేసుకున్నారు. ఇది పోలీసులకు పెద్ద విజయని కశ్మీర్ ఐజీపీ విజయ్ కుమార్ తెలిపారు. గడిచిన నెలరోజుల్లో డజనుకు పైగా జరిగిన ఎన్కౌంటర్లలో 22 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.
#UPDATE | J&K: Total 5 terrorists killed in dual encounters in Pulwama (4) and Budgam (1) in the last twelve hours. JeM commander terrorist Zahid Wani & a Pakistani terrorist among the killed.
— ANI (@ANI) January 30, 2022
Visuals deferred by unspecified time. pic.twitter.com/xxiNt3Kk1O