గచ్చిబౌలి లోని లిఫ్ట్ డోర్ల మధ్య ఇరుక్కొని చిన్నారి మృతి

గచ్చిబౌలి లోని  లిఫ్ట్ డోర్ల మధ్య ఇరుక్కొని చిన్నారి మృతి

గచ్చిబౌలి, వెలుగు: ఐటీ కారిడార్​లోని ఓ ప్రైవేటు హాస్టల్​లో లిఫ్ట్​లో ఇరుక్కొని ఓ ఐదేండ్ల చిన్నారి కన్నుమూసింది. ఆడుకుంటూ వెళ్లిన చిన్నారి లిఫ్ట్​కు ఉన్న రెండు ఇనుప గేట్ల మధ్యలో ఇరుక్కొని తలకు తీవ్ర గాయాలై ప్రాణాలిదిలింది. జార్ఘండ్ ​రాష్ట్రానికి చెందిన మోహన్​ఘోష్​ కుటుంబంతో కలిసి కొన్నేండ్ల కింద సిటీకి వచ్చాడు. ఐటీ కారిడార్​ గౌలిదొడ్డిలోని మహీ ఉమెన్స్​పీజీ హాస్టల్​లో వంట మనిషిగా పనిచేస్తూ.. భార్య కెంతూ ఘోష్​, కొడుకు బిట్టు ఘోష్​, కోడలు, మనువరాలు బిస్తు ఘోష్​(5) తో కలిసి హాస్టల్​లోనే ఉంటున్నారు. తండ్రితో కలిసి బిట్టు ఘోష్​ ఇదే హాస్టల్​లో వంట పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం హాస్టల్​లో బిస్తు ఘోష్ ఆడుకుంటుండగా.. కుటుంబసభ్యులు ఎవరి పనుల్లో వారున్నారు. 

బిస్తు ఘోష్​ ఆడుకుంటూ వెళ్లి హాస్టల్​లోని లిఫ్ట్​ డోర్లు తెరిచింది. లోపలకు వెళ్లే క్రమంలో లిఫ్ట్​రెండు గ్రిల్స్​డోర్ల మధ్య ఇరుక్కుపోగా.. లిఫ్ట్​కింద నుంచి ఐదో ఫ్లోర్​కు వెళ్లి, అక్కడి నుంచి మూడో ఫ్లోర్​కు వచ్చి నిలిచిపోయింది. లిఫ్ట్​ ఆగిపోవడంతో అపార్ట్​మెంట్​వాసులు గమనించగా లిఫ్ట్​రెండు డోర్ల మధ్య బిస్తు ఘోష్​ నుజ్జునుజ్జయి చనిపోయి కనిపించింది. గచ్చిబౌలి పోలీసులకు సమాచారం ఇవ్వగా సంఘటన స్థలానికి చేరుకుని లిఫ్ట్​లో ఇరుక్కుపోయిన బిస్తుఘోష్​ను బయటకు తీశారు. అప్పటి వరకు కళ్లేదుటే ఆడుకుంటున్న చిన్నారి లిఫ్ట్​లో ఇరుక్కొని మృతి చెందడం స్థానికంగా విషాదాన్ని  నింపింది.