తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

తెలంగాణలో తగ్గుతున్న కరోనా కేసులు

రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 502 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో నిన్న 17,296 కరోనా టెస్టులు చేసినట్టు వైద్య, ఆరోగ్య శాఖ తెలిపింది. జీహెచ్ఎంసీ పరిధిలో అత్యధికంగా 141 పాజిటివ్ కేసులు వచ్చాయి. నిన్న  1539 మంది కరోనా నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. వైరస్ తో ముగ్గురు చనిపోయినట్టు హెల్త్ బులిటెన్ లో తెలిపారు అధికారులు. రాష్ట్రంలో ఇప్పటివరకు 2,57,876 కేసులు నమోదయ్యాయి. కోలుకున్న వారి సంఖ్య 2,42,084 గా ఉంది. వైరస్ తో ఇప్పటివరకు 1407 చనిపోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 14,385 యాక్టివ్ కేసులున్నాయి.

రూపాయికే క్వార్టర్ మందు