మేడిపల్లిలో 510 కిలోల గంజాయి స్వాధీనం..

మేడిపల్లిలో 510 కిలోల గంజాయి స్వాధీనం..

మేడ్చల్ :  రాచకొండ కమిషనరేట్ పరిధిలో 510 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డిసెంబర్ 8వ తేది శుక్రవారం ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించి గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నారు. అనంతరం రాచకొండ సిపి సిపి డిఎస్ చౌహాన్ మీడియాతో సమావేశం నిర్వహించి గంజాయి ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.  రాచకొండ, మల్కాజిగిరి ఎస్వోటి టీమ్ పక్కా సమాచారంతో 510 కిలోలు(102 ప్యాకెట్ లు) గంజాయిని అక్రమంగా తరలిస్తున్న మనోహర్, ప్రవీణ్ అనే వ్యక్తులను అదుపులోకి తీసుకుని గంజాయి తోపాటు  ఓ వాహన్నన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 

మార్కెట్ లో స్వాధీనం చేసుకున్న గంజాయి విలువ సుమారు కోటి యాభై ఎనిమిది లక్షల రూపాయిలు ఉంటుందని తెలిపారు. సులభంగా డబ్బు సంపాదించాలనే ఉద్దేశ్యంతో మనోహర్, ప్రవీణ్ అనే వ్యక్తులు..  హైదరాబాద్ మీదుగా ఒరిస్సా నుండి హర్యానా హిస్సార్ కు గంజాయిని తరలించేందుకు ప్రయత్నించారని తెలిపారు. గంజాయి రవాణాకు ట్రాన్స్‌పోర్ట్ ఆటలో సీక్రెట్ పార్టీషన్ ఏర్పాటు చేసి తరలిస్తుండగా.. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వాహనాలు తనిఖీ చేస్తుండగా వీరిని అదుపులోకి తీసుకున్నట్లు ఆయన చెప్పారు.