కూకట్పల్లి, వెలుగు : కూకట్పల్లి పోలీసులు శనివారం వాహనాల తనిఖీల్లో రూ.54.52లక్షలు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్ఎస్ఓటీ, కూకట్ పల్లి పోలీసులు శనివారం మధ్యాహ్నం కేపీహెచ్బీలోని అల్లూరి కాంప్లెక్స్వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.
ఆ టైంలో మియాపూర్నుంచి కూకట్పల్లి వైపు వెళ్తున్న ఇటాచీ నగదు నిర్వహణ సంస్థ వెహికల్ను ఆపి తనిఖీ చేయగా, రూ.54లక్షల52వేల488 పట్టుబడింది. సంస్థ కస్టోడియన్పి.నగేష్, గార్డ్మహ్మద్ఖలీల్ డబ్బుకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో సీజ్చేశారు.