కూకట్​పల్లిలో రూ.54 లక్షలు సీజ్

కూకట్​పల్లిలో రూ.54 లక్షలు సీజ్

కూకట్​పల్లి, వెలుగు : కూకట్​పల్లి పోలీసులు శనివారం వాహనాల తనిఖీల్లో రూ.54.52లక్షలు పట్టుకున్నారు. వివరాల్లోకి వెళ్తే.. బాలానగర్​ఎస్ఓటీ, కూకట్ పల్లి పోలీసులు శనివారం మధ్యాహ్నం కేపీహెచ్​బీలోని అల్లూరి కాంప్లెక్స్​వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు.

ఆ టైంలో మియాపూర్​నుంచి కూకట్​పల్లి వైపు వెళ్తున్న ఇటాచీ నగదు నిర్వహణ సంస్థ వెహికల్​ను ఆపి తనిఖీ చేయగా, రూ.54లక్షల52వేల488 పట్టుబడింది. సంస్థ కస్టోడియన్​పి.నగేష్, గార్డ్​మహ్మద్​ఖలీల్ డబ్బుకు సంబంధించిన ఎలాంటి డాక్యుమెంట్లు చూపించకపోవడంతో సీజ్​చేశారు.