
హైదరాబాద్, వెలుగు : ఇరిగేషన్డిపార్ట్ మెంట్ లో ఈ ఏడాది 56 మంది ఇంజనీర్లు రిటైర్కానున్నారు. ఈఎన్సీ నుంచి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ఇంజనీర్ వరకు రిటైర్అవుతున్న వారి జాబితాను డిపార్ట్మెంట్సోమవారం రిలీజ్చేసింది. రిటైర్అవుతున్న వారిలో ఓ అండ్ఎం ఈఎన్సీ నాగేందర్రావు, సీఈలు విష్ణు ప్రసాద్, శ్రీనివాస్రెడ్డి, అజయ కుమార్, విజయ భాస్కర్రావు ఉన్నారు.
22 మంది ఎస్ఈలు రిటైర్కానున్నారు. వారిలో బీఆర్ఎస్ప్రభుత్వంలో ఇరిగేషన్, సీఎం ఓఎస్డీగా పని చేసిన శ్రీధర్దేశ్పాండే, ఇరిగేషన్ టెక్నికల్సెక్రటరీ భీమ్ప్రసాద్ ఉన్నారు. 19 మంది ఎగ్జిక్యూటివ్ఇంజనీర్లు, పది మంది డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ఇంజనీర్లు ఈ ఏడాది రిటైర్అవుతున్నారు.