విదేశానికి వెళ్లొచ్చేసరికి చోరీ... రూ.57 లక్షల ఆభరణాలు, రూ.17.5 లక్షల నగదు అపహరణ

విదేశానికి వెళ్లొచ్చేసరికి చోరీ... రూ.57 లక్షల ఆభరణాలు, రూ.17.5 లక్షల నగదు అపహరణ

బషీర్​బాగ్​, వెలుగు: నారాయణగూడ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో చోరీ జరిగిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. నారాయణగూడ పోలీసులు తెలిపిన ప్రకారం.. హైదర్ గూడలోని అవంతి నగర్ లో నివాసముంటున్న వ్యాపారి రామకృష్ణ గత నెల 27న భార్యాపిల్లలతో కలిసి టర్కీ దేశానికి విహార యాత్రకు వెళ్లారు. 

అతని తల్లీతండ్రి కూడా అదే బిల్డింగ్ లో పైఅంతస్తులో ఉంటున్నారు. ఈ నెల 7న ఇంటికి రామకృష్ణ ఇంటికి రాగానే బెడ్ రూమ్ డోర్ తెరిచి ఉన్నట్లు గమనించాడు. అనుమానంతో బీరువాను చూడగా అందులో దాచిన రూ.17.5 లక్షల నగదు, రూ.57 లక్షల విలువైన బంగారు ఆభరణాలు చోరీకి కనిపించలేదు. బాధితుడి ఫిర్యాదుతో క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.