ఆరున్నర కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరి అరెస్ట్

ఆరున్నర కిలోల గంజాయి స్వాధీనం..ఇద్దరి అరెస్ట్

మూసాపేట, వెలుగు: గంజాయి అమ్మేందుకు యత్నిస్తున్న ఇద్దరు యువకులను కూకట్​పల్లి, బాలానగర్​ఎస్​ఓటీ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డికి చెందిన ఇద్దరు స్నేహితులు బిజ్జ వికాస్​(25), గంట రాకేశ్(26) కొంతకాలంగా ఏపీలోని అరకు నుంచి గంజాయి తీసుకువచ్చి సిటీలో అమ్ముతున్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు గురువారం కూకట్​పల్లి వై జంక్షన్​వద్ద నిఘా పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి రూ.లక్ష విలువ చేసే ఆరున్నర కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. కేసులు నమోదు చేసి నిందితులను రిమాండ్​కు తరలించారు.