హైకోర్టుకు ఆరుగురు జడ్జిలను నియమిస్తూ ఉత్తర్వులు

హైకోర్టుకు ఆరుగురు జడ్జిలను నియమిస్తూ ఉత్తర్వులు

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్ర హైకోర్టుకు కొత్తగా ఆరుగురు జడ్జిలను నియమిస్తూ సుప్రీంకోర్టు కొలీజియం చేసిన సిఫార్సులకు రాష్ట్రపతి ఆమోదం తెలిపారు. ఇందులో నలుగురిని జడ్జిలుగా, ఇద్దరిని అదనపు జడ్జిలుగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. జడ్జిలుగా నియమితులైనవారిలో ఏనుగుల వెంకట వేణుగోపాల్, నాగేశ్ భీమపాక, పుల్లా కార్తీక్ అలియాస్ పి ఎలమందర్,  కాజ శరత్ ఉన్నారు.

రెండేండ్ల పాటు అదనపు జడ్జిలుగా జగ్గన్నగారి శ్రీనివాసరావు, నామవరపు రాజేశ్వర్ రావును నియమించారు. అడ్వకేట్ కోటా నుంచి పదోన్నతి కల్పించాలని వీళ్ల పేర్లను సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని కొలీజియం కేంద్రానికి  సిఫార్సు చేసింది. సీజేఐగా జస్టిస్ ఎన్వీ రమణ బాధ్యతలు చేపట్టాక రాష్ట్ర హైకోర్టు జడ్జిల సంఖ్యను 24 నుంచి 42 కు పెంచారు. ప్రస్తుతం 27 మంది జడ్జిలుండగా  తాజా నియామకంతో జడ్జిల సంఖ్య 33కు చేరనుంది.