దారుణం.. 6 ఏళ్ల బాలికను రేప్ చేసి.. లంగ్స్ బయటకు తీసి..

దారుణం.. 6 ఏళ్ల బాలికను రేప్ చేసి.. లంగ్స్ బయటకు తీసి..

యూపీలో దారుణం జరిగింది. ఆరేళ్లు బాలికను రేప్ చేసి.. చంపి.. ఊపిరితిత్తులు బయటకు తీశారు. ఈ ఘోర ఘటన కాన్పూర్‌లో ఆదివారం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. స్థానికంగా నివసించే పరశురాం దంపతులకు 1999లో వివాహం జరిగింది. కానీ వారికి ఇప్పటికీ పిల్లలు లేరు. దాంతో వారు చేతబడి చేసే వ్యక్తిని కలిశారు. పిల్లలు కలగాలంటే.. బాలికను బలివ్వాలని చెప్పాడు. అంతేకాకుండా బాలిక ఊపిరితిత్తులు తీసుకొస్తే పూజ చేస్తానని చెప్పాడు. దాంతో పరశురాం ఈ పని చేయాలని తన మేనల్లుడు అంకుర్ కురిల్ మరియు అతని స్నేహితుడు బీరన్‌లను కోరాడు.

దీపావళి రోజు పిల్లలందరూ పటాకులు కాల్చుతూ పండగ చేసుకుంటున్నారు. ఘటంపూర్‌లోని భద్రాస్ ప్రాంతానికి చెందిన ఒక ఆరేళ్ల బాలిక కూడా పటాకులు కొనుక్కోవడానికి షాపు వద్దకు వెళ్లింది. అది గమనించిన అంకుర్ మరియు బీరన్‌లు ఆ బాలికను కిడ్నాప్ చేసి సమీపంలోని అడవిలోకి తీసుకెళ్లారు. అప్పటికే అతిగా మద్యం సేవించిన అంకుర్ మరియు బీరన్‌లు బాలికను తాగిన మత్తులో రేప్ చేశారు. ఆ తర్వాత బాలికను చంపి.. పరశురాం చెప్పినట్లుగా బాలిక లంగ్స్ బయటకు తీశారు.

షాపుకు వెళ్లిన బాలిక కనిపించకపోవడంతో కుటుంబసభ్యులు ఆ రాత్రంతా చుట్టుపక్కల వెతికారు. కానీ ఫలితం లేకపోయింది. మరుసటి రోజు ఉదయం అడవి గుండా వెళ్లే గ్రామస్తులు మృతదేహాన్ని చూసి పోలీసులకు సమాచారమిచ్చారు. ఆ ప్రాంతంలో బాలికకు సంబంధించిన చెప్పులు, బట్టలు ఒక చెట్టు వద్ద పడిఉన్నాయి. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. స్నిఫర్ డాగ్స్‌తో సెర్చింగ్ చేపట్టారు. డాగ్ క్లూస్ మరియు సైంటిఫిక్ ఆధారాల ద్వారా పరశురాంను పోలీసులు అదుపులోకి తీసుకొని విచారించారు. మొదట పరశురాం కేసును తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించాడు. కానీ, పోలీసులు తమదైన శైలిలో విచారించగా అసలు విషయాన్ని బయటపెట్టాడు.

ఈ ఘటన గురించి ఎ.ఎస్.పి బ్రజేష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ‘నిందితులను అరెస్ట్ చేశాం. పరుశురాంతో పాటు ఆయన భార్యను కూడా అదుపులోకి తీసుకున్నాం. నిందితులపై ఐపీసీ మరియు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశాం’ అని ఆయన తెలిపారు.

ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఈ ఘోరానికి పాల్పడ్డ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. బాధితురాలి కుటుంబానికి వెంటనే ఐదు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించాలని అధికారులకు సూచించారు. ఈ కేసును ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారించి.. నిందితులకు త్వరగా శిక్ష పడేలా చూస్తామని ఆయన తెలిపారు.

For More News..

యాడ్స్ కోసం రూ. 300 కోట్లు ఖర్చు పెట్టిన తెలంగాణ ప్రభుత్వం

సోన్‌సూద్‌కు అరుదైన గౌరవం అందించిన ఆయన సొంతరాష్ట్రం

తప్పుడు వార్తలపై పోరాటానికి 1.15 మిలియన్ డాలర్లు

అమెరికాలో 10 లక్షలకు పైగా పిల్లలకు కరోనా