650 కిలోల గంజాయి స్వాధీనం

650 కిలోల గంజాయి స్వాధీనం

భద్రాద్రికొత్తగూడెం, వెలుగు :  అక్రమంగా తరలిస్తున్న గంజాయిని లక్ష్మీదేవిపల్లి పోలీసులు పట్టుకున్నట్లు కొత్తగూడెం డీఎస్పీ రెహమాన్​తెలిపారు. గురువారం లక్ష్మీదేవిపల్లి పోలీస్​ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కేసు వివరాలను ఆయన వెల్లడించారు. గురువారం లక్ష్మీదేవిపల్లి పోలీసులు రేగళ్ల క్రాస్​రోడ్​ వద్ద వెహికల్స్​తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో ఒక లారీలో రూ. 1.62కోట్ల చేసే 650 కిలోల గంజాయి పట్టుబడింది. 

లారీని సీజ్ చేసి డ్రైవర్, క్లీనర్​ను అదుపులోకి తీసుకొని విచారించారు. రాజస్థాన్​ రాష్ట్రానికి చెందిన డ్రైవర్​సుందర్​ రామ్, క్లీనర్​ సురేశ్​తో కలిసి మూంగ్​దాల్​ లారీ లోడ్​తో రాజస్థాన్​నుంచి రాజమండ్రికి గత నెల 28న వచ్చారు. గురువారం తిరుగుప్రయాణమయ్యారు. రాజస్థాన్​కు చెందిన ఓం ప్రకాశ్​సూచన మేరకు చింతూరు వద్ద ​గంజాయిని లోడ్​ చేసుకొని తీసుకొచ్చినట్లు తేలింది. ఓం ప్రకాశ్​తో పాటు సుందర్​ రామ్​, సురేశ్​పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఓం ప్రకాశ్​ పరారీలో ఉన్నారని డీఎస్పీ తెలిపారు.