పంజాగుట్ట, వెలుగు : ఎన్నికల తనిఖీల్లో భాగంగా ఎస్ఆర్నగర్ పోలీసులు భారీ మొత్తంలో డబ్బు పట్టుకున్నారు. గురువారం మధ్యాహ్నం ఎస్ఆర్ నగర్ పోలీసులు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు అమీర్ పేటలోని ఏషియన్ సినిమాస్ వద్ద వెహికల్ చెకింగ్ చేపట్టారు. సికింద్రాబాద్లోని మెట్టుగూడకు చెందిన ఏటీఎం కస్టోడియన్ ఆపరేటర్ వినయ్(22) కారులో అదే రూట్లో వెళ్తుండగా పోలీసులు అతడి వెహికల్ను తనిఖీ చేశారు.
ఆ కారులో రూ.69 లక్షలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఆ డబ్బుకు సంబంధించి వినయ్ ఎలాంటి ఆధారాలు చూపించకపోవడంతో సీజ్ చేసినట్లు ఇన్స్పెక్టర్ రాంప్రసాద్ రావు తెలిపారు.