
- తనిఖీ చేసిన కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డి, వెలుగు : పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కామారెడ్డి ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. పశువుల అక్రమ రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన చెక్పోస్టులను బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు. భిక్కనూరు మండలంలో హైవేపై టోల్ ఫ్లాజా వద్ద చెక్పోస్టు, బస్వాపూర్, మాచారెడ్డి మండలం ఘన్ పూర్ చెక్పోస్టులను ఎస్పీ తనిఖీ చేశారు. ప్రతి వెహికల్ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు. జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు బార్డర్లో 7 చెక్పోస్ట్లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసులకు ప్రజలు సహకరించాలని, పశువుల అక్రమ రవాణా జరిగితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని
తెలిపారు.