పశువుల అక్రమ రవాణాకు చెక్​ .. కామారెడ్డి జిల్లాలో 7 చెక్​ పోస్టుల ఏర్పాటు : ఎస్పీ రాజేశ్​చంద్ర

పశువుల అక్రమ రవాణాకు చెక్​  .. కామారెడ్డి  జిల్లాలో 7 చెక్​ పోస్టుల ఏర్పాటు  : ఎస్పీ రాజేశ్​చంద్ర
  •   తనిఖీ చేసిన కామారెడ్డి  ఎస్పీ రాజేశ్​చంద్ర 

కామారెడ్డి, వెలుగు : పశువుల అక్రమ రవాణా నియంత్రణకు జిల్లాలో నిరంతరం పర్యవేక్షణ ఉంటుందని కామారెడ్డి ఎస్పీ రాజేశ్​చంద్ర పేర్కొన్నారు.  పశువుల అక్రమ రవాణా నియంత్రణ కోసం ఏర్పాటు చేసిన  చెక్​పోస్టులను బుధవారం ఎస్పీ తనిఖీ చేశారు. భిక్కనూరు మండలంలో హైవేపై టోల్ ఫ్లాజా వద్ద  చెక్​పోస్టు, బస్వాపూర్, మాచారెడ్డి మండలం ఘన్ పూర్ చెక్​పోస్టులను ఎస్పీ తనిఖీ చేశారు.  ప్రతి వెహికల్​ను క్షుణ్ణంగా తనిఖీ చేయాలన్నారు.   జిల్లాలో పశువుల అక్రమ రవాణాను అరికట్టేందుకు బార్డర్​లో 7  చెక్​పోస్ట్​లను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.  పోలీసులకు ప్రజలు సహకరించాలని, పశువుల అక్రమ రవాణా జరిగితే డయల్ 100కు సమాచారం ఇవ్వాలన్నారు. బక్రీద్ పండుగ ప్రశాంతంగా నిర్వహించుకోవాలని 
తెలిపారు.