- ఉత్తర్వులు జారీ చేసిన మహారాష్ట్ర సర్కార్
పుణె: కరోనా మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో జైళ్లలో రద్దీని తగ్గించేందుకు మహారాష్ట్ర ప్రభుత్వం 7200 మంది ఖైదీలను రిలీజ్ చేసింది. మరో 10వేల మందిని రిలీజ్ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని అధికారులు చెప్పారు. వాళ్లందర్నీ టెంపరరీ బెయిల్, పెరోల్ మీద వదిలిపెట్టామన్నారు. జైళ్లలో క్రౌడ్ తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలన్న సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు ఏడేంళ్ల వరకు శిక్ష పడ్డ ఖైదీలను టెంపరరీగా వదిలిపెట్టామన్నారు. “ లాక్డౌన్కు ముందు రాష్ట్రంలోని 60 జిల్లాల్లో 35000 మంది ఖైదీలు ఉన్నారు. ఇప్పటి వరకు 7200 మందిని రిలీజ్ చేశాం. మొత్తం మీద 17వేల మందిని టెంపరరీ బెయిల్పై రిలీజ్ చేస్తాం. దీని కోసం హైలెవల్ కమిటీని నియమించాం” అని అధికారులు చెప్పారు. ముంబైలోని ఆర్థుర్ రోడ్ జైలులో 100 మందికి కరోనా పాజిటివ్ రావడంతో ఈ డెసిషన్ తీసుకున్నామన్నారు. ఆ జైలు నుంచి దాదాపు 700 మంది ఖైదీలను విడుదల చేశారు. ప్రస్తుతం అక్కడ 1572 మంది ఖైదీలు ఉన్నారు. మహారాష్ట్రలో కరోనా రోజు రోజుకు విజృంభిస్తోంది. ముంబై, పుణె తదితర ప్రాంతాల్లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. దీంతో ఆయా ఏరియాల్లో ఈ నెల 31 వరకు లాక్డౌన్ పొడిగించాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది.