8 మంది ఐఏఎస్​ల బదిలీ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

8 మంది ఐఏఎస్​ల బదిలీ.. రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 8 మంది ఐఏఎస్​లను, ఒక స్పెషల్​ గ్రేడ్​ డిప్యూటీ కలెక్టర్​ను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సీసీఎల్​ సెక్రటరీగా ఉన్న బి. గోపి.. కరీంనగర్‌‌‌‌ కలెక్టర్‌‌‌‌గా బదిలీ అయ్యారు. 

ఈ స్థానంలో ఉన్న ఆర్వీ. కర్ణన్​ నల్లగొండ జిల్లా కలెక్టర్​గా వెళ్లారు. ఇక కరీంనగర్‌‌‌‌ అదనపు కలెక్టర్‌‌‌‌గా ప్రఫుల్‌‌‌‌ దేశాయ్‌‌‌‌,  జీహెచ్‌‌‌‌ఎంసీ అదనపు కమిషనర్‌‌‌‌గా వెంకటేశ్ ధోత్రే, సూర్యాపేట అదనపు కలెక్టర్‌‌‌‌గా చెక్కా ప్రియాంక, ఆసిఫాబాద్‌‌‌‌ అదనపు కలెక్టర్‌‌‌‌గా హేమంత కేశవ్‌‌‌‌ పాటిల్‌‌‌‌ నియమితులయ్యారు. 

ALSO READ :అనిల్ రెడ్డికి ఎంపీ సీటు ఆఫర్!

పెద్దపల్లి అదనపు కలెక్టర్‌‌‌‌గా అరుణ శ్రీ, స్పెషల్​గ్రేడ్​ డిప్యూటీ కలెక్టర్ రమేశ్‌‌‌‌ మెదక్‌‌‌‌ జిల్లా అదనపు కలెక్టర్‌‌‌‌గా అపాయింట్ అయ్యారు. నల్గొండ కలెక్టర్‌‌‌‌గా ఉన్న వినయ్‌‌‌‌ కృష్ణారెడ్డిని జనరల్‌‌‌‌ అడ్మినిస్ట్రేషన్‌‌‌‌ డిపార్ట్‌‌‌‌మెంట్‌‌‌‌లో రిపోర్ట్‌‌‌‌ చేయాలని పేర్కొన్నారు.