 
                                    హైదరాబాద్: తెలంగాణలో మరోసారి ఐఏఎస్ అధికారుల బదిలీ జరిగింది. 8 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణా రావు శుక్రవారం (అక్టోబర్ 31) ఉత్తర్వులు జారీ చేశారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల స్పెషల్ ప్రిన్సిపల్ సెక్రటరీగా సభ్యసాచి ఘోష్, గురుకుల సంక్షేమ కమిషనర్గా అనితా రామచంద్రన్కు అదనపు బాధ్యతలు అప్పగించారు. రవాణా శాఖ కమిషనర్గా ఇలాంబర్తిని నియమించిన ప్రభుత్వం పశుసంవర్ధకశాఖ కార్యదర్శిగా ఆయనకు అదనపు బాధ్యతలు అప్పగించింది.
జీఏడీ పొలిటికల్ ఇంచార్జి సెక్రటరీగా E.శ్రీధర్, ఆయిల్ ఫెడ్ ఎండీగా యాస్మిన్ బాషా నియమితులయ్యారు. ఎస్సీ అభివృద్ధి కమిషనర్గా జి. జితేందర్ రెడ్డి నియామకం కాగా ఆయనకు ఎస్సీ సహకార సంస్థ ఎండీగా అదనపు బాధ్యతలు కల్పించారు. మెట్రో పాలిటన్ అర్బన్ డెవలప్మెంట్ కార్యదర్శి బాధ్యతలను సీఎస్ రామకృష్ణ రావు తన వద్దే ఉంచుకున్నారు.

 
         
                     
                     
                    