ఎంపీ నామాకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు

ఎంపీ  నామాకు ఈడీ షాక్.. రూ.80.65 కోట్ల ఆస్తులు జప్తు

టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర్ రావుకు ఈడీ షాక్ ఇచ్చింది. నామా నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన రూ.80 కోట్ల 65 లక్షల ఆస్తులను ఈడీ జప్తు చేసింది. హైదరాబాద్, ఖమ్మం, ప్రకాశం జిల్లాల్లోని 28 స్థిరాస్థులను అటాచ్ చేసింది. గతంలో రూ.73 కోట్ల 74 లక్షల కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా మరిన్ని ఆస్తులను సీజ్ చేసింది. రుణాల పేరిట మోసం చేసిన కేసులో నామా నాగేశ్వరరావు ఆస్తులు జప్తు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. 

రాంచీ ఎక్స్ ప్రెస్ హైవే పేరిట రుణాలు తీసుకొని దారి మళ్లించారని నామా నాగేశ్వరరావుపై ఆరోపణలు ఉన్నాయి. సుమారు 361 కోట్ల 92 లక్షల రూపాయలను నేరుగా దారి మళ్లించారని ఈడీ నిర్ధారించింది. నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య ఆధ్వర్యంలో ఆరు డొల్ల కంపెనీలు ఉన్నట్లు ఈడీ గుర్తించింది. 

‘రాంచీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వేస్ లిమిటెడ్’ పేరుతో ఫర్మ్‌‌‌‌

నేషనల్‌‌‌‌ హైవేస్‌‌‌‌ అథారిటీ ఆఫ్​ ఇండియా (ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ) 2011లో రాంచీ-– రార్‌‌‌‌గావ్-– జంషెడ్‌‌‌‌పూర్‌‌‌‌ మధ్య ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ హైవే నిర్మాణానికి టెండర్స్ పిలిచింది.114  కి.మీ నుంచి 277.50  కి.మీ (సుమారు 163.50 కి.మీ) వరకు ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌-33లో 4 -లేనింగ్ ప్రాజెక్ట్‌‌‌‌ను అనౌన్స్‌‌‌‌ చేసింది. ఈ ప్రాజెక్ట్‌‌‌‌ను నామా నాగేశ్వర్‌‌‌‌రావుకు చెందిన మధుకాన్‌‌‌‌ గ్రూప్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కంపెనీ దక్కించుకుంది. ‘రాంచీ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ వేస్ లిమిటెడ్’ పేరుతో ఫర్మ్‌‌‌‌ ను రిజిస్టర్‌‌‌‌‌‌‌‌ చేసింది. ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి కాకపోవడంతో ఎన్‌‌‌‌హెచ్‌‌‌‌ఏఐ, కెనరా బ్యాంక్ యాజమాన్యం 2019 మార్చి 12న సీబీఐకి ఫిర్యాదు చేశాయి. కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు.. ఫోరెన్సిక్ ఆడిటర్లు, ఇంజనీర్లు, సబ్-కాంట్రాక్టర్లు, మధుకాన్ గ్రూప్ ప్రమోటర్ల స్టేట్‌‌‌‌మెంట్లను రికార్డ్ చేశారు. 2020 డిసెంబర్‌‌‌‌‌‌‌‌లో చార్జ్‌‌‌‌షీట్‌‌‌‌ ఫైల్ చేశారు. సీబీఐ నమోదు చేసిన ఎఫ్‌‌‌‌ఐఆర్‌‌‌‌‌‌‌‌ ఆధారంగా గతేడాది ఈడీ కేసు రిజిస్టర్ చేసింది. 

నిరుడు జూన్‌‌‌‌లో..

నిరుడు జూన్‌‌‌‌లో హైదరాబాద్‌‌‌‌లోని నామా నాగేశ్వరరావు ఇంటితో పాటు డైరెక్టర్లు, ప్రమోటర్ల ఇండ్లు ఆఫీస్‌‌‌‌ల్లో ఈడీ అధికారులు సోదాలు జరిపారు. నామా నాగేశ్వరరావు ఇంటి నుంచి లెక్కల్లో లేని రూ. 34 లక్షల క్యాష్​ను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్‌‌‌‌ అకౌంట్స్‌‌‌‌ సీజ్‌‌‌‌ చేశారు. హైదరాబాద్, పశ్చిమ బెంగాల్​తోపాటు విశాఖపట్నం, ప్రకాశం, కృష్ణా జిల్లాలో రూ. 88.85 కోట్ల విలువ చేసే స్థిరాస్తులు, రూ.7.36 కోట్ల విలువ చేసే చరాస్తులను ఈడీ అటాచ్ చేసింది. రాంచీ ఎక్స్‌‌‌‌ ప్రెస్‌‌‌‌వేస్ లిమిటెడ్ పేరుతో  కెనరా బ్యాంకు నుంచి సుమారు 1,030 కోట్ల రుణాలు మధుకాన్​ తీసుకుంది. 

ఆరు షెల్‌‌‌‌ కంపెనీలతో..

నిర్దేశించిన గడువులోగా ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి చేయలేదు. దీనికి తోడు అధిక ఖర్చులను తప్పుగా క్లెయిమ్ చేయడానికి ప్లాన్ చేసింది.షెల్‌‌‌‌ కంపెనీలు ఉషా ప్రాజెక్ట్స్, బీఆర్‌‌‌‌ ‌‌‌‌విజన్స్, శ్రీ ధర్మ శాస్తా కన్​స్ట్రక్షన్స్, నాగేంద్ర కన్‌‌‌‌స్ట్రక్షన్స్, రాగిణి ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్, వరలక్ష్మి కన్‌‌‌‌స్ట్రక్షన్స్ ద్వారా రూ. 75.50 కోట్లు క్యాష్‌‌‌‌ విత్‌‌‌‌డ్రా చేశారు. ఈ ఆరు షెల్‌‌‌‌ కంపెనీలు నామా నాగేశ్వరరావు, నామా సీతయ్య నిర్వహిస్తున్నారు. మధుకాన్ గ్రూప్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ కంపెనీకి రూ. 361.29 కోట్లు డైవర్ట్‌‌‌‌ అయ్యాయి. ఆ తర్వాత ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌ హైవే ప్రాజెక్ట్‌‌‌‌ పూర్తి చేయకపోవడంతో పాటు బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్స్‌‌‌‌ను చెల్లించలేదు.