ప్రపంచంలోని పులుల్లో 80శాతం ఇండియాలోనే..

ప్రపంచంలోని పులుల్లో 80శాతం ఇండియాలోనే..

భారత ప్రభుత్వం వన్యమృగ సంరక్షణ కోసం 1952లో ఇండియన్​ బోర్డ్​ ఫర్​ వైల్డ్​ లైఫ్​ అనే సంస్థను ఏర్పాటు చేసింది. ఈ సంస్థ అధ్యక్షుడు ప్రధాన మంత్రి. 1972లో వన్యమృగ సంరక్షణ చట్టాన్ని చేశారు. ఈ చట్టం ప్రకారం దేశంలో అంతరించిపోతున్న జంతువులకు సంబంధించి కొన్ని కార్యక్రమాలు చేపట్టారు. ఇందులో భాగంగా 1973 ఏప్రిల్​ 1న ఆపరేషన్​ టైగర్​ అనే ప్రాజెక్టును ప్రారంభించి తొమ్మిది టైగర్​ రిజర్వ్​లను ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ప్రకటించకముందు మన జాతీయ జంతువు సింహం. ప్రస్తుతం మన జాతీయ జంతువు పులి. దేశంలో ఏర్పాటు చేసిన మొదటి టైగర్​ రిజర్వ్​ కర్ణాటకలోని బందీపూర్​ టైగర్​ రిజర్వ్​. ప్రస్తుతం దేశంలో 48 టైగర్​ రిజర్వులు ఉన్నాయి. 48వ టైగర్​ రిజర్వ్​ ఉత్తరాఖండ్​లోని రాజాజీ టైగర్​ రిజర్వ్​. దేశంలో అతి పెద్ద టైగర్​ రిజర్వ్​ నాగార్జునసాగర్​– శ్రీశైలం టైగర్​ రిజర్వ్​. అతి చిన్న టైగర్​ రిజర్వ్​ మహారాష్ట్రలోని ఫెంచ్​. తెలంగాణ రాష్ట్రంలో కవ్వాల్​, నాగార్జున సాగర్​, శ్రీశైలం టైగర్​ రిజర్వ్​లు వ్యాపించి ఉన్నాయి. 

టైగర్​ సెన్సెస్​

దేశంలో మొదటిసారిగా టైగర్​ సెన్సెస్​ను 2006లో చేపట్టారు. టైగర్​ సెన్సెస్​ 2018 ప్రకారం భారతదేశంలోని పులుల సంఖ్య 2967. టైగర్​ సెన్సెస్​ 2014 ప్రకారం భారతదేశంలోని పులుల సంఖ్య 2226. ప్రపంచంలోని పులుల్లో 80శాతం ఇండియాలో ఉన్నాయి. 

అధిక పులులు గల రాష్ట్రం  

1. మధ్యప్రదేశ్​ (526), 2. కర్ణాటక (524), 3. ఉత్తరాఖండ్​ (442), పశ్చిమబెంగాల్​లోని బుక్సా, జార్ఖండ్​లోని ఫలమావు, మిజోరాంలోని దంపా టైగర్​ రిజర్వ్​ల్లో పులులు లేవు..