గురుకుల పరీక్షకు 84 శాతం మంది అటెండ్

గురుకుల పరీక్షకు 84 శాతం మంది అటెండ్
  • ఇంటర్ అడ్మిషన్స్​కు పరీక్ష 

హైదరాబాద్ ,వెలుగు: గురుకుల ఇంటర్ కాలేజీల్లో వచ్చే ఏడాది ఇంటర్ అడ్మిషన్లకు నిర్వహించిన పరీక్షలకు 84 శాతం స్టూడెంట్స్ అటెండ్ అయినట్టు తెలంగాణ గురుకుల విద్యాలయాల సంస్థ సెక్రటరీ రమణకుమార్ తెలిపారు. మొత్తంగా 35 గురుకుల కాలేజీల్లో 309 సెంటర్లలో ఆదివారం పరీక్ష జరిగినట్టు సెక్రటరీ పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తంగా 73,528 మంది స్టూడెంట్స్ అప్లై చేసుకోగా 61,442 మంది పరీక్షకు హాజరయ్యారు.