85 శాతం విద్యుత్ తెలంగాణకే: రామగుండం ఎన్టీపీసీ ఈడీ

85 శాతం విద్యుత్ తెలంగాణకే: రామగుండం ఎన్టీపీసీ ఈడీ

గోదావరిఖని, వెలుగు: రామగుండం ఎన్టీపీసీ స్టేజ్–​1 కింద నిర్మించిన ప్లాంట్​లో ఉత్పత్తయిన కరెంట్​లో రాష్ట్రానికే 85 శాతం సప్లై అవుతుందని ప్రాజెక్ట్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కేదార్ రంజన్ పాండు తెలి పారు. మంగళవారం ఎన్టీపీసీ మిలినీయం హాల్​లో ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండం లో 1983లో 200 మెగావాట్లతో ప్రారంభమైన విద్యు త్ ప్లాంట్​ విస్తరిస్తూ ఇప్పుడు 4,200 మెగావాట్లకు చేరుకున్నదన్నారు. దేశంలోనే అతిపెద్ద 100 మెగా వాట్ల సామర్థ్యం గల ఫ్లోటింగ్ సోలార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కరెంట్​ఉత్పత్తి రామగుండంలో జరుగుతుందన్నారు.

 త్వరలోనే మరో 76 మెగావాట్ల ప్లోటింగ్​ సోలార్, 56 మెగావాట్లతో ఖాళీ ప్రదేశాల్లో ల్యాండ్​ సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తెలంగాణ ఎన్టీపీసీ ప్లాంట్​లో భాగంగా స్టేజ్–2లో 2,400 మెగావాట్ల ప్లాంట్​నిర్మాణానికి సంబంధించిన ప్రక్రియ కొనసాగుతున్నదని, ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు మొదలుపెడతామన్నారు.