బెంగాల్ లో ఒక్కరోజే 98 మంది మృతి

బెంగాల్ లో ఒక్కరోజే 98 మంది మృతి

కోల్​కతాపశ్చిమ బెంగాల్ లో కరోనా వైరస్ తీవ్రంగా విజృంభిస్తోంది. మంగళవారం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సమాచారం ప్రకారం, రాష్ట్రంలో 98 మంది వైరస్ కు బలైపోయారు. రాష్ట్రంలో కొవిడ్ మరణాల సంఖ్య 140కి చేరింది. పాజిటివ్ కేసులు భారీగా పెరిగాయి. ఒకే రోజు 296 కొత్త కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 1,344కి చేరింది. రాష్ట్రంలో సోమవారం 67 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇప్పటివరకూ మొత్తం 218 మంది వైరస్ నుంచి కోలుకున్నారు.

డెత్ రేట్12.8 శాతం.. దేశంలోనే అత్యధికం

కరోనా డెత్ రేట్ బెంగాల్ లో దేశంలోనే అత్యధికంగా 12.8 శాతంగా ఉన్నట్లు సెంట్రల్ టీం వెల్లడించింది. బెంగాల్ సర్కారు టెస్టులు తక్కువగా చేస్తోందని, బలహీనమైన నిఘా ఉందని, కేంద్రానికి చెప్తున్న లెక్కలూ తప్పుల తడకగా ఉంటున్నాయని స్పష్టం చేసింది.  టెస్టులు తక్కువగా చేయడం, పర్యవేక్షణ, నిఘా కొరవడటమే రాష్ట్రంలో డెత్ రేట్ పెరగడానికి కారణమని అభిప్రాయపడింది. రాష్ట్ర అధికార యంత్రాంగం తమకు సహకరించలేదని, కొవిడ్ పర్యవేక్షణ డేటాను ఇవ్వలేదని కంప్లయింట్ చేసింది.   ప్రభుత్వం తమను శత్రువులుగా చూస్తూ, విధులు నిర్వహించేందుకు ఏమాత్రం సహకరించలేదని కేంద్ర ప్రభుత్వ టీం విమర్శించింది.

అవును.. లెక్కల్లో తప్పులున్నయ్: చీఫ్ సెక్రటరీ

పశ్చిమ బెంగాల్ లో కొవిడ్ కేసులు, మరణాలకు సంబంధించిన లెక్కలు పర్​ఫెక్టుగా లేవని, కొన్నిచోట్ల నెంబర్లు తారుమారు అయ్యాయని ఆ రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించింది. అయితే, ఆడిట్ కమిటీ గుర్తించిన 72 మరణాలను కొవిడ్ మరణాల లిస్టులో చేర్చేందుకు చీఫ్​సెక్రటరీ రాజీవ సిన్హా తిరస్కరించారు. అవి కోమార్బిడిటీ మరణాలు (కొవిడ్ తో పాటు ఇతర రోగాలతో చనిపోవడం) అని, వాటికి కొవిడ్ తో సంబంధం ఉన్నా, ఇతర అనారోగ్యాల వల్లే చనిపోయారన్నారు.

వాళ్లు.. ‘ఆరోగ్య సేతు’లో రిజిస్టర్ చేసుకోవాలె

విదేశాల నుంచి విమానాల్లో తిరిగి వచ్చే ఇండియన్లు ఆరోగ్య సేతు మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని కేంద్ర హోం శాఖ వెల్లడించింది. ఆ యాప్ లో తమ పేర్లను రిజిస్టర్ చేసుకోవాలని, ఆ తర్వాత వారికి ఈ ఆపరేషన్ కు సంబంధించిన పూర్తి వివరాలు అందుతాయని మంగళవారం కేంద్ర హోం శాఖ జాయింట్ సెక్రటరీ పుణ్య సలీల శ్రీవాస్తవ తెలిపారు. ఆయా రాష్ట్రాల్లోని కార్మికుల కోసం 62 రైళ్లు నడిచాయని,  70 వేల మందిని సొంత రాష్ట్రాలకు చేర్చామన్నారు.

కొత్తగా 2,966 కేసులు..

దేశంలో కేసులు 50 వేలకు దగ్గరవుతున్నాయి. మంగళవారం కొత్తగా 2,966 కేసులు నమోదు కాగా, మొత్తం కేసుల సంఖ్య 49,400కి చేరింది. మొత్తం 1,693 మంది చనిపోయారు. 183 మంది ఒక్కరోజే చనిపోయారు. మహారాష్ట్రలో కేసుల సంఖ్య 15 వేలు దాటింది. మంగళవారం కొత్తగా 984 కేసులు రికార్డవగా, మొత్తం కేసుల సంఖ్య 15,525కి పెరిగింది. 583 మంది చనిపోయారు. దేశవ్యాప్తంగా 14,136 మంది డిశ్చార్జి అయ్యారు. కొత్తగా 1291 మంది కోలుకున్నారు. 33,567 మంది ట్రీట్​మెంట్​ తీసుకుంటున్నారు. ప్రపంచంలో మరణించిన వారి సంఖ్య రెండున్నర లక్షలు దాటింది. 2,55,715 మంది వైరస్​కు బలయ్యారు. 36,94,903 మంది వైరస్​ బారిన పడ్డారు. 12,24,480 మంది
కోలుకున్నారు.