భారత్ లో 2,56,611 కరోనా కేసులు..7135 మరణాలు

భారత్ లో 2,56,611 కరోనా కేసులు..7135 మరణాలు

దేశ వ్యాప్తంగా కరోనా పంజా విసురుతోంది. రోజు రోజుకు రికార్డ్ స్థాయిలో కేసులు పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 9983 కొత్త  కరోనా కేసులు నమోదవ్వగా 206 మంది మరణించారు. దీంతో దేశ వ్యాప్తంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 2,56,611 చేరుకోగా.. మరణాల సంఖ్య 7135 కు చేరింది.  ఇప్పటి వరకు 124095 మంది కరోనా నుంచి కోలుకోగా 125381 మంది చికిత్స తీసుకుంటున్నారు. అత్యధికంగా మహారాష్ట్రలో 85975 కరోనా కేసులు నమోదవ్వగా 3060 మంది చనిపోయారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో భారత్ 6వ స్థానంలో ఉండగా..మరణాల్లో  12వ స్థానంలో ఉంది. 20,07,449  కరోనా కేసులు 1,12,469 మరణాలతో అమెరికా అగ్రస్థానంలో ఉంది.

see more news

పర్సనల్‌‌ వెహికల్స్‌‌కు దేశమంతా ఒకే రోడ్‌‌ ట్యాక్స్‌‌!

ఆధార్ ​కార్డు తెస్తెనే నర్సన్న దర్శనం