గొంతుకోసి ఇద్దరు చెల్లెళ్లను చంపేసింది

గొంతుకోసి ఇద్దరు చెల్లెళ్లను చంపేసింది
  • యూపీ​లో ఓ యువతి దారుణం

లక్నో: ఉత్తరప్రదేశ్​లోని ఇటావా జిల్లాలో దారుణం జరిగింది. 20 ఏండ్ల అంజలి అనే యువతి తన సొంత చెల్లెళ్లనే చంపేసింది. తల్లిదండ్రులు ఇంట్లో లేని సమయంలో పారతో ఇద్దరి గొంతు కోసింది. ఆపై పారను కడిగి పక్కన పెట్టింది. రక్తపు మరకలు కనిపించకుండా ఉండేందుకు బట్టలు ఉతికి ఆరేసి తనకేమీ తెలియనట్లు నటించింది. పోలీసులు ఆధారాలు సేకరించడంతో ఇద్దరు చెల్లెళ్లను తానే చంపినట్లు ఒప్పుకుంది. 

మృతులు 7, 4 ఏండ్ల వయసు చిన్నారులని, నిందితురాలు అంజలిని అరెస్ట్ చేశామని పోలీసులు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ఆ తర్వాత సాక్ష్యాలు లేకుండా చేసేందుకు ప్రయత్నించిందని తెలిపారు. ‘‘తల్లిదండ్రులు సోమవారం ఉదయం కూలి పనికి వెళ్లగా ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే ఉన్నారు. ఏం జరిగిందో తెలియదుగానీ, అదే సమయంలో వాళ్ల అక్క అంజలి పారతో ఇద్దరి గొంతు కోసింది. సాయంత్రం తల్లిదండ్రులు వచ్చేసరికి పిల్లలిద్దరూ రక్తపుమడుగులో పడిఉన్నారు. దీంతో ఆమె సమాచారమివ్వగా స్పాట్​కు వెళ్లి దర్యాప్తు చేపట్టాం” అని పోలీసులు వివరించారు.