భూమి పట్టా చేయడం లేదని .. దత్త పుత్రుడి సూసైడ్​

భూమి పట్టా  చేయడం లేదని  ..  దత్త పుత్రుడి సూసైడ్​

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు:  జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం తాటికొండలో వ్యవసాయ భూమిని తన పేరుపై పట్టా చేయనందుకు 12 రోజుల కింద మనస్తాపంతో ఓ యువకుడు పురుగుల మందుతాగి సూసైడ్​ అటెంప్ట్​ చేశాడు.  ప్రైవేట్​ హస్పిటల్​లో చికిత్స పొందుతూ శనివారం చనిపోయాడు. సీఐ రాఘవేందర్​ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన ఎడమ ప్రవీణ్​(23) తన బంధువైన ఎడమ గట్టయ్య ఇంటికి బాల్యంలో దత్తత వెళ్లాడు. 

దత్తత తల్లిదండ్రులకు చెందిన వ్యవసాయ భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్​ చేయించి పట్టా పాసుబుక్కు అందజేయాలని కొన్ని నెలలుగా ప్రవీణ్​ కోరుతున్నాడు.  దత్తత తల్లిదండ్రులు ఇప్పుడు, అప్పుడు అంటూ కాలయాపన చేస్తుండడంతో జులై 4న ఇంట్లో గొడవచేశాడు.  దత్తత తల్లిదండ్రులు ససేమిరా అనడంతో మనస్తాపంతో వ్యవసాయ బావి వద్దకు వెళ్లి పురుగుల మందుతాగాడు.

 చికిత్స కోసం గ్రామస్తులు హనుమకొండలోని ప్రైవేట్​ హాస్పిటల్​కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ చనిపోయాడు. మృతుడి భార్య శిరీష ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.