కంటైనర్ లో ఆవుల తరలింపు

కంటైనర్ లో ఆవుల తరలింపు

ఘట్ కేసర్, వెలుగు :  ఆవులు, ఎద్దులను తరలిస్తున్న ఓ కంటైనర్ ను పోలీసులు అదుపులోకి తీసుకుని నలుగురిపై కేసు నమోదు చేశారు.  ఘట్ కేసర్ ఇన్ స్పెక్టర్ ఎస్. సైదులు తెలిపిన ప్రకారం.. ఎదులాబాద్ అండర్ పాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా కంటైనర్ (టీఎస్12 యుఈ3429) లారీ తప్పించుకునేందుకు యత్నించింది. దీంతో  అనుమానం వచ్చిన పోలీసులు వెంబడించి ఆపి చెక్ చేశారు.  

ఒడిశా నుంచి కంటైనర్ లో సిటీలోని  కబేళాకు 44 ఆవులు, 36 ఎద్దులను తీసుకొస్తున్నారు. కంటైనర్ లో వాటికి కుక్కడంతో ఆవు చనిపోయింది. కంటైనర్ ను అదుపులోకి తీసుకుని ఆవులను కొనుగోలు చేసిన సబావత్ విజయ కుమార్, డ్రైవర్ సాజిద్, మరో డ్రైవర్ షమీమ్ అహ్మద్ (34), కూలీ కొంగారపు గంగరాజు (27) లపై కేసు నమోదు చేశారు.  సాజిద్ ఘటన స్థలం నుంచి పరార్ అయ్యాడు. పశువులను గోశాలకు తరలించారు.