మంత్రి కేటీఆర్ ను తిట్టారని బీజేపీ కార్పొరేటర్ పై కేసు

 మంత్రి కేటీఆర్ ను తిట్టారని బీజేపీ కార్పొరేటర్ పై కేసు

హైదరాబాద్ : సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకుల శ్రీవాణిపై సీసీఎస్ లో కేసు నమోదైంది. సోషల్ మీడియాలో మంత్రి కేటీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారని టీఆర్ఎస్ నాయకుల ఫిర్యాదుతో పోలీసులు ఆమెకు నోటీసులు జారీ చేశారు. ఈనెల 4వ తేదీన సీసీఎస్ కు రావాలని శ్రీవాణిని ఆదేశించారు. టీఆర్ఎస్ సోషల్ మీడియాలో పని చేసే సిబ్బంది తనపై తప్పుడు కేసు పెట్టారంటూ కార్పొరేటర్ శ్రీవాణి ఆగ్రహం వ్యక్తం చేశారు. 

శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా మంత్రి కేటీఆర్ పై విమర్శలు చేయలేదని కార్పొరేటర్ శ్రీవాణి చెప్పారు. కేటీఆర్ పై తాను చేసిన విమర్శలకు సంబంధించిన వీడియో ఇప్పటికీ తన సోషల్ మీడియా ఖాతాల్లో ఉందని, తానేమీ తప్పు చేయలేదని వివరణ ఇచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న తప్పిదాలను ప్రశ్నిస్తున్నందుకే తనపై టీఆర్ఎస్ నాయకులు కేసు పెట్టారని మండిపడ్డారు. తాము కూడా న్యాయపరంగా కేసును ఎదుర్కొంటామని చెప్పారు. తనకు న్యాయం జరిగే వరకూ పోరాడుతానని అన్నారు.