పిల్లల కోసం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్
గాంధీ సూపరింటెండెంట్ డా.రాజారావు
పద్మారావునగర్, వెలుగు : వరల్డ్ డయాబెటిక్ డేను పురస్కరించుకొని గాంధీ హాస్పిటల్లో సోమవారం సెంటర్ ఆఫ్ఎక్సలెన్స్ ప్రారంభించారు. ఈ సందర్భంగా సూపరింటెండెంట్డా.రాజారావు మాట్లాడుతూ.. ఎండోక్రనాలజీ డిపార్ట్మెంట్, నోవోనోర్డిస్క్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సహకారంతో ఈ సెంటర్ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పిల్లల్లో డయాబెటిస్ గుర్తించి చికిత్స అందించేందుకు ఇది ఉపయోగపడనుందని చెప్పారు. ఈ సెంటర్లో19 ఏండ్లలోపు వారికి ప్రత్యేక సదుపాయాలు కల్పించామని వెల్లడించారు. అనంతరం హాస్పిటల్ఆవరణలో డయాబెటిస్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు.
కార్యక్రమంలో ఎండోక్రనాలజీహెచ్ఓడీ విజయ్శేఖర్ రెడ్డి, నోవోనోర్డిస్క్ ఎడ్యుకేషన్ కార్పొరేట్వైస్ ప్రెసిడెంట్విక్రాంత్ క్షత్రియ, డాక్టర్లు, సిబ్బంది, ట్రస్ట్ ప్రతినిధులు పాల్గొన్నారు. అలాగే వరల్డ్యాంటీ మైక్రోబియల్అవేర్నెస్వీక్–2022 పురస్కరించుకొని యాంటీ మైక్రోబియల్వినియోగం, వాటివల్ల కలిగే సైడ్ఎఫెక్ట్ లపై హాస్పిటల్లో సోమవారం చర్చ నిర్వహించారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ డా.రమ్య, డా.మణిపాల్, డా. జి.జె. అర్చన, డా.పద్మజ పలు అంశాలపై ప్రసంగించారు. సూపరింటెండెంట్ రాజారావుతోపాటు మైక్రోబయాలజీ హెచ్ఓడీ డా.ఎస్.రాజేశ్వర్రావుతోపాటు పలువురు డాక్టర్లు పాల్గొన్నారు.