కొందరు యువత ఇటీవల సమాజాన్ని మర్చిపోయి బహిరంగంగా ప్రేమ లోకంలో మునిగిపోతున్నారు. బైక్పై వెళ్తూ.. రొమాన్స్ చేస్తూ కెమెరాలకు చిక్కిన ఘటనలు చాలా రాష్ట్రాల్లో వెలుగు చూశాయి. అలాంటి మరో ఘటనే ఢిల్లీలో జరిగింది. మంగోల్పురి సమీపంలో ఓ జంట బైక్పై ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో బహిరంగంగా వారిరువురు కౌగిలుంచుకున్నారు.
అంతటితో ఆగకుండా హద్దులు దాటి ఇతరులకు ఇబ్బంది కలిగేలా ప్రవర్తించారు. ఈ దృశ్యాల్ని ఒకరు వీడియో తీసి పోలీసులకు పంపించారు. ఇందుకు సంబంధించిన వీడియోలను జులై 16న పోలీసులు షేర్ చేశారు. వీడియో కారులో కూర్చున్న వ్యక్తి తీసినట్లుగా ఉంది. ఘాజియాబాద్ పోలీసులు నిందితులను గుర్తించి వారికి రూ.11వేల ఫైన్ వేశారు.
అజాగ్రత్తగా బండి నడిపిన వ్యక్తిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించిన చలాన్లు.. వీడియోలను పోలీసులు ట్విటర్లో షేర్ చేశారు.