పాలకుర్తిలో ఉద్రిక్తత..పోలీసులు,బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట

పాలకుర్తిలో ఉద్రిక్తత..పోలీసులు,బీఆర్ఎస్ నాయకుల మధ్య తోపులాట

జనగామ జిల్లా పాలకుర్తిలో ఉద్రిక్తత చోటుచేసుకుంది . తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటులో  బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య వివాదం తలెత్తింది. బీఆర్ఎస్ ,కాంగ్రెస్ శ్రేణులు ఒకరినొకరు వాగ్వాదానికి దిగారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. 

అసలేం జరిగిందంటే..?   కొత్త నమూనా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించేందుకు కాంగ్రెస్ శ్రేణులు యత్నించారు.  దీంతో బీఆర్ఎస్ శ్రేణులు,  కాంగ్రెస్ శ్రేణుల ప్రయత్నాన్ని అడ్డుకునేందు ప్రయత్నించారు.  గతంలో ఉన్న తెలంగాణ తల్లి రూపంలో ఉన్న విగ్రహాన్ని ప్రతిష్టించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. జూన్ 2న  రేపు తెలంగాణ తల్లి విగ్రహ ఆవిష్కరణను నిరసిస్తూ ఆందోళనకు దిగారు. దీంతో పోలీసులు   బీఆర్ఎస్ శ్రేణులను ఎక్కడికక్కడ అరెస్ట్ చేశారు.

►ALSO READ | రాష్ట్ర అవతరణ వేడుకలకు ఏర్పాట్లు చేయాలి

 మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సతీమణి ఉషా దయాకర్ రావు పాలకుర్తి చౌరస్తాకు ర్యాలీగా  వచ్చారు. దీంతో బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు.  పోలీసులకు, బీఆర్ఎస్  శ్రేణులకు మధ్య వాగ్వాదం జరగడంతో ఉద్రిక్తత చోటుచేసుకుంది.