గన్నేరువరం, వెలుగు: బ్యాంకులో డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లిన ఓ రైతు గుండెపోటుతో కుప్పకూలాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలంలో జరిగింది. కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండలం జంగపల్లి గ్రామానికి చెందిన హనుమండ్ల బాలయ్య(65) గురువారం మధ్యాహ్నం గుండ్లపల్లి ఎక్స్రోడ్డు వద్ద ఉన్న ఎస్బీఐ బ్రాంచికి డబ్బులు డ్రా చేసేందుకు వెళ్లాడు. క్యాష్ కౌంటర్ ఎదుట నిల్చున్న సమయంలో అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో కుప్పకూలిపోయాడు. ఇది గమనించిన స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేసినప్పటికీ, అప్పటికే ఆయన మృతిచెందాడు.
