భద్రాచలం జూనియర్​ కాలేజీకి పూర్వ విద్యార్థి రూ.50లక్షల విరాళం

భద్రాచలం జూనియర్​ కాలేజీకి పూర్వ విద్యార్థి రూ.50లక్షల విరాళం

భద్రాచలం, వెలుగు :  భద్రాచలం జూనియర్​ కాలేజీ పూర్వ విద్యార్థి ఎన్ఆర్ఐ డాక్టర్​తాళ్లూరి జయశేఖర్ ​రూ.50లక్షల విరాళాన్ని అందజేశారు. బూర్గంపాడు మండలం ఇరవెండికి చెందిన జయశేఖర్​ భద్రాచలం జూనియర్​ కాలేజీలో చదివారు. కాలేజీకి నూతన భవన నిర్మాణానికి రూ.కోటి ఖర్చు అవుతుంది. భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్​ తెల్లం వెంకట్రావు రూ.50లక్షలు ప్రభుత్వ నిధులు మంజూరు చేయగా, వాటికి సమాంతరంగా జయశేఖర్​ రూ.50లక్షలు ఇచ్చారు. ఈ మేరకు శనివారం కాలేజీలో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు, కాలేజీ ప్రిన్సిపల్ ​కృష్ణవేణికి తన అనుమతి పత్రాన్ని అందజేశారు. 

ఎమ్మెల్యేకు ఏఎంసీ కాలనీవాసుల వినతి 
 

మాలమహానాడు జిల్లా అధ్యక్షుడు అల్లాడి పౌల్​రాజ్​ ఆధ్వర్యంలో భద్రాచలంలోని ఏఎంసీ కాలనీ నిరుపేదలు శనివారం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని  ముట్టడించారు. 20 ఏళ్లుగా అద్దె ఇళ్లలో జీవనం కొనసాగిస్తున్నామని తెలిపారు. తమకు ఇళ్ల స్థలాలు, డబుల్ బెడ్​రూమ్​ ఇళ్లు కేటాయించాలని డిమాండ్​ చేశారు. అనంతరం 
ఎమ్మెల్యే డాక్టర్​ తెల్లం వెంకట్రావుకు వినతి పత్రం అందజేశారు.