బీరు బాటిల్తో స్నేహితుడి తల పగలగొట్టి ప్రాణ స్నేహితుడే హత్యకు పాల్పడిన ఘటన హైదరాబాద్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎస్ఆర్నగర్ లో నివసిస్తున్న గణేష్, సురేష్ ఇద్దరు ఫ్రెండ్స్.
ఆగస్టు 11 అర్ధరాత్రి వారిరువురు మద్యం సేవించారు. అదే సమయలో ఓ విషయంపై ఇద్దరికి వివాదం తలెత్తింది. కోపోద్రిక్తుడైన సురేష్.. తన చేతిలో ఉన్న బీరు సీసాతో గణేష్ తలపై కొట్టాడు. దీంతో గణేష్కి తీవ్ర గాయాలయ్యాయి.
స్థానికులు గమనించి క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.