మిత్రుడి అంత్యక్రియలకు వెళ్లి మృతి

మిత్రుడి అంత్యక్రియలకు వెళ్లి మృతి

దుబ్బాక, వెలుగు :  మిత్రుడి అంత్యక్రియలకు వెళ్లిన స్నేహితుడు వాగులో పడి చనిపోయాడు. గ్రామస్తుల కథనం ప్రకారం...సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఆకారం గ్రామానికి చెందిన మెట్ల శ్రీనివాస్, దండబోయిన పర్శరాములు ట్రాక్టర్​ డ్రైవర్లు. ఇద్దరు మంచి స్నేహితులు. శ్రీనివాస్​బుధవారం గుండెపోటుతో మరణించాడు. మిత్రుడి అంత్యక్రియలు పూర్తయిన తర్వాత పర్శరాములు గ్రామ సమీపంలోని కూడవెళ్లి వాగులోకి అందరితో కలిసి స్నానానికి వెళ్లాడు. వాగులో ఈత కొడుతున్న క్రమంలో ఒక్కసారిగా మునిగిపోయాడు. ఎంతకూ బయటకు రాకపోవడంతో అక్కడున్న వారు గాలించి , పర్శరాములును బయటకు తీశారు. అప్పటికే పర్శరాములు చనిపోయాడు. మృతుడికి భార్య మౌనిక, ఇద్దరు బిడ్డలు, కొడుకు ఉన్నారు.