
- టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్కు సన్మానం
హైదరాబాద్, వెలుగు : బాల్య స్నేహం విడదీయరాని బంధమని.. ఎన్నాళ్లయినా.. ఎన్నేండ్లయినా ఆ రోజులు మరుపురానివని హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ రామంతాపూర్ బ్రాంచ్ పూర్వ విద్యార్థులు నిరూపించారు. ఆ స్కూల్-1979 బ్యాచ్కు చెందిన విద్యార్థులు.. తమతో పాటు కలిసి చదువుకున్న హైదరాబాద్ టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ సాయిప్రసాద్రెడ్డిని ఘనంగా సన్మానించారు.
హైదరాబాద్ బేగంపేట్లోని లైఫ్ స్టైల్ బిల్డింగ్ టెన్ డౌనింగ్ స్ట్రీట్ హాల్లో ఆదివారం ఈ ప్రోగ్రామ్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఇండస్ట్రియలిస్ట్లు కల్యాణ్ చక్రవర్తి, గద్వాల బాబిరెడ్డి, జయంత్, ఎయిర్ ఫోర్స్ గ్రూప్ కెప్టెన్ విజయ్, ప్రముఖ లాయర్లు, రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్లు, ఉన్నతోద్యోగులు పాల్గొని తమ చిన్న నాటి అనుభవాలను గుర్తు చేసుకున్నారు.