మంచాలలో ప్రకృతి అందాల కనువిందు

మంచాలలో ప్రకృతి అందాల కనువిందు

రంగారెడ్డి జిల్లా మంచాల మండలంలో ప్రకృతి అందాలు ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల కురిసిన వానలకు చెన్నారెడ్డిగూడ, బోడకొండ గ్రామాల మధ్య గుట్టల మీదుగా వర్షపు నీరు కిందకు ప్రవహించడంతో వాటర్ ఫాల్స్ ఏర్పడ్డాయి. రంగాపూర్ నుంచి లోయపల్లి గ్రామానికి వెళ్లే రూట్ లో గ్రీనరీ, వాటర్ ఫాల్స్ కనువిందు చేస్తున్నాయి. 

అయితే, ప్రమాదాలు జరిగే అవకాశం ఉండటంతో ఇక్కడికి సందర్శకులు రాకుండా పోలీసులు గతంలో ఆంక్షలు విధించారు. గస్తీ కూడా ఏర్పాటు చేశారు. అధికారులు, పోలీసులు వాటర్ పాల్స్ వద్ద సేఫ్టీ ప్రికాషన్స్ చేపట్టడంతో పాటు గైడెన్స్ చేస్తూ వాటిని చూసేందుకు అనుమతివ్వాలని సందర్శకులు కోరుతున్నారు.
 – వెలుగు, మంచాల