కొత్త సంవత్సరం వేడుకల వేళ.. భారీగా పట్టుబడిన గంజాయి

కొత్త సంవత్సరం వేడుకల వేళ.. భారీగా పట్టుబడిన గంజాయి

తెలంగాణ పోలీసులు డ్రగ్స్, గంజాయి అమ్మకాలు, విక్రయాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. కొత్త సంవత్సరం వేడుకల ముందు పలుచోట్ల భారీగా గంజాయి పట్టుబడుతోంది. తాజాగా రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో 80 కేజీల గంజాయిని ఎస్ఓటీ బృందం స్వాధీనం చేసుకుంది. 

విశాఖపట్నం నుండి హైదరాబాద్ మీదుగా మహారాష్ట్రకు గంజాయిని తరలిస్తుండగా నిందితులను ఎస్ఓటీ టీం సభ్యులు పట్టుకున్నారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు పోలీసులు చెప్పారు. వారి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఒక కారును సీజ్ చేశారు. నిందితులపై NDPS యాక్ట్ కింద కేసు నమోదు చేశారు రాజేంద్రనగర్ పోలీసులు. ప్రస్తుతం మాదకద్రవ్యాల పై తెలంగాణ పోలీస్ శాఖ సీరియస్ గా వ్యవహరిస్తోంది.