
- పీపీఏ సమావేశంలో తెలంగాణ పట్టు
హైదరాబాద్, వెలుగు: పోలవరం బ్యాక్వాటర్తో తెలంగాణ భూ భాగంలో తలెత్తే ముంపుపై జాయింట్సర్వే చేయాల్సిందేనని తెలంగాణ పట్టుబట్టింది. సోమవారం హైదరాబాద్లోని కృష్ణా గోదావరి బేసిన్ఆర్గనైజేషన్(కేజీబీవో)లో పీపీఏ చైర్మన్ శివ్ నందన్కుమార్అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీ ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ శశిభూషణ్ కుమార్, తెలంగాణ నుంచి ఇంటర్ స్టేట్ సీఈ మోహన్ కుమార్, గోదావరి బేసిన్ డిప్యూటీ డైరెక్టర్ సుబ్రమణ్య ప్రసాద్ పాల్గొన్నారు.
ఎన్జీటీ తీర్పుతో పోలవంతో తలెత్తే ముంపుపై జాయింట్సర్వే చేయాల్సిందేనని సీడబ్ల్యూసీ ఆదేశాలిచ్చినా ఏపీ పట్టించుకోవడం లేదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. వర్షాకాలం లోపే జాయింట్ సర్వే పూర్తి చేసే ముంపునకు గురయ్యే ప్రాంతాలకు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మొదట ఇందుకు ఏపీ ససేమిరా అన్న పీపీఏ చైర్మన్ జోక్యంతో అంగీకారం తెలిపింది.