పోలవరం ముంపుపై జాయింట్ ​సర్వే చేయాలి

పోలవరం ముంపుపై జాయింట్ ​సర్వే చేయాలి
  • పీపీఏ సమావేశంలో తెలంగాణ పట్టు

హైదరాబాద్, వెలుగు: పోలవరం బ్యాక్​వాటర్​తో తెలంగాణ భూ భాగంలో తలెత్తే ముంపుపై జాయింట్​సర్వే చేయాల్సిందేనని తెలంగాణ పట్టుబట్టింది. సోమవారం హైదరాబాద్​లోని కృష్ణా గోదావరి బేసిన్​ఆర్గనైజేషన్​(కేజీబీవో)లో పీపీఏ చైర్మన్​ శివ్​ నందన్​కుమార్​అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఏపీ ఇరిగేషన్​ ప్రిన్సిపల్​ సెక్రటరీ శశిభూషణ్​ కుమార్​, తెలంగాణ నుంచి ఇంటర్​ స్టేట్​ సీఈ మోహన్ ​కుమార్, గోదావరి బేసిన్​ డిప్యూటీ డైరెక్టర్​ సుబ్రమణ్య ప్రసాద్​ పాల్గొన్నారు.

ఎన్జీటీ తీర్పుతో పోలవంతో తలెత్తే ముంపుపై జాయింట్​సర్వే చేయాల్సిందేనని సీడబ్ల్యూసీ ఆదేశాలిచ్చినా ఏపీ పట్టించుకోవడం లేదని తెలంగాణ అభ్యంతరం తెలిపింది. వర్షాకాలం లోపే జాయింట్​ సర్వే పూర్తి చేసే ముంపునకు గురయ్యే ప్రాంతాలకు రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. మొదట ఇందుకు ఏపీ ససేమిరా అన్న పీపీఏ చైర్మన్ ​జోక్యంతో అంగీకారం తెలిపింది.