జగిత్యాల జిల్లాలో చెట్టును ఢీకొన్న లారీ.. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్

జగిత్యాల జిల్లాలో చెట్టును ఢీకొన్న లారీ.. క్యాబిన్ లో ఇరుక్కున్న డ్రైవర్

జగిత్యాల జిల్లాలో ధాన్యం లోడుతో వెళ్తున్న ఓ లారీ చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ నుజ్జు నుజ్జు అయ్యింది. డ్రైవర్ క్యాబిన్ లో ఇరుక్కుపోయాడు. జగిత్యాల జిల్లా మేడిపెల్లి మండల కేంద్రం మూలమలుపు వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాదానికి లారీ అతివేగమే కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. 

క్యాబిన్ లో డ్రైవర్ సందీప్ ఇరుక్కుని.. గంట పాటు నరకయాతన అనుభవించాడు. ప్రమాదం గురించి తెలియగానే స్థానిక పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని.. సహాయక చర్యలు చేపట్టారు. క్యాబిన్ నుంచి డ్రైవర్ ను అతి కష్టం మీద బయటకు తీసి.. ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం డ్రైవర్ కు డాక్టర్లు ట్రీట్ మెంట్ అందిస్తున్నారు. చెన్నూరు నుండి అదిలాబాద్ కు ధాన్యం లోడుతో లారీ వెళ్తుండగా ప్రమాదం జరిగింది.