రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ను  ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. బైక్ ను  ఢీకొన్న లారీ.. ఇద్దరు మృతి

రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. షాద్ నగర్, పరిగి రోడ్డులో ఓ బైక్ ను లారీ ఢీకొంది. ఈ ఘటనలో బైకుపై వెళ్తున్న ఒక యువకుడు మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రికి తరలిస్తుండగా మరో వ్యక్తి మార్గమధ్యలోనే చనిపోయాడు. 

ఫరూఖ్ నగర్ మండలం మహల్ ఎలికట్ట గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు, షాద్ నగర్ కు చెందిన మరో యువకుడు బైక్ పై వెళ్తుండగా.. షాద్ నగర్, పరిగి రోడ్డులో ఉన్న పెట్రోల్ బంకు ఎదురుగా ఈ ప్రమాదం జరిగింది. చనిపోయిన వారిలో మహల్ ఎలికట్టకు చెందిన రాజు, మధు ఉన్నారు.  యూటర్న్ చేస్తుండగా బైకును లారీ ఢీకొట్టడం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. 

ప్రమాదం జరిగిన తర్వాత లారీ ఆపకుండా వెళ్తుండగా మొగలిగిద్ద వద్ద గ్రామస్తులు అడ్డుకున్నారు. విషయం తెలియగానే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లోనూ దర్యాప్తు చేస్తున్నారు. ఘటనా స్థలాన్ని షాద్ నగర్ సీఐ ప్రతాప్ లింగం, ఎస్ఐ విజయ్ పరిశీలించారు. ప్రమాదానికి అసలు కారణాలేంటి..? అన్న దానిపై విచారిస్తున్నారు. మరోవైపు.. మృతుల తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. విగతజీవిగా పడి ఉన్న తమ వారిని చూసి గుండెలవిసేలా రోదించడం అక్కడున్న ప్రతి ఒక్కర్నీ కంటతడి పెట్టించింది.