అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి సూసైడ్

అప్పుల బాధతో రైలు కింద పడి వ్యక్తి సూసైడ్
  • హఫీజ్ పేట పీఎస్ పరిధిలో ఘటన

మాదాపూర్, వెలుగు : అప్పుల బాధతో రైలు కింద పడి ఓ వ్యక్తి సూసైడ్ చేసుకున్న ఘటన హఫీజ్ పేట రైల్వే స్టేషన్ పరిధిలో జరిగింది. రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని రాజమండ్రికి చెందిన యార్లగడ్డ రాంబాబు(35) భార్య బుజ్జితో కలిసి సిటీకి వచ్చి కొండాపూర్ లో ఉంటూ ర్యాపిడో డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. బుధవారం ఉదయం ఇంట్లో నుంచి బయటికి వచ్చిన రాంబాబు హఫీజ్ పేట రైల్వే ట్రాక్ పై పడుకోగా.. ఓ రైలు అతనిపై నుంచి వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.

సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని డెడ్ బాడీని హాస్పిటల్ కు తరలించారు. అప్పుల బాధతోనే రాంబాబు సూసైడ్ చేసుకున్నట్లు తెలుస్తోంది. కేసు ఫైల్ చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నాంపల్లి రైల్వే పోలీసులు తెలిపారు.